టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇంకా సీనియర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్.. ఒక రా ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. అతని కెరిర్లో ఈ సినిమా ఎన్నడూ లేని భారీ హైప్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రోల్ అల్ట్రా పవర్ఫుల్గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ఇంకా టీజర్ చూస్తే పూర్తిగా అర్థమవుతోంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్లో జోరు పెంచిన మూవీ టీమ్ ఇక నుంచి రోజుకో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ ని నింపుతోంది.ఇక తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ అప్డేట్ కూడా వచ్చేసింది. 


ఫిబ్రవరి 22 సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు తొలి పాట 'మళ్లీ మళ్లీ 'ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయబోతున్నట్లు టీం పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసింది. ఇది అక్కినేని  అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఇకపోతే ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా హిప్ హాప్ రాపర్ అయిన హిప్హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి టాలీవుడ్ లో మంచి పేరుంది. అందుకు తగ్గట్లు ఈ సినిమాను స్టైలిష్ గా పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. దాదాపు రూ.90కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది.మరి ఫస్ట్ పాటతో అఖిల్ ఆకట్టుకుంటాడో లేడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: