2014లో వచ్చిన లౌక్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు గోపీచంద్. ఆ తర్వాత అంతటి రేంజ్ సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. చివరిగా వచ్చిన సిటిమార్ చిత్రంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు గోపీచంద్. కానీ లౌక్యం రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరొక సినిమాను చేస్తున్నారు గోపీచంద్. గతంలో శౌర్యం, లౌక్యం సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కాంబినేషన్లు రామబాణం అనే సినిమాతో గోపీచంద్ డైరెక్టర్ శ్రీనివాస్
తెరకెక్కించబోతున్నారు.


ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్లో గోపీచంద్ ఈ సినిమా టైటిల్నీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ తాజాగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 21 2023న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఈ సినిమా రిలీజ్ డేట్ నిజమే అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాకి పోటీగా విడుదల కాబోతున్నట్లు సమాచారం. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తున్నది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రామబాణం సినిమాలో ఖుష్బూ, జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.


మరి విడుదల తేదీ పై ఇంకా అధికారికంగా ప్రకటన ప్రకటించలేదు. సాయి ధరంతేజ్ విరుపాక్షి సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఈ సినిమాని కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు ఈయన కూడా సుకుమార్ శిష్యుడే కావడం గమనార్హం. ఈ సినిమాకు సుకుమార్ కథన అందిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలలో ఎవరిది పై చేయవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: