ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ హీరోలు కూడా టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకోవాలని ఆశపడిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో అటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి హిందీ ఇండస్ట్రీలో కొత్త ఊపిరి పోసాడు అని చెప్పాలి. పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాడు. ఇక ఈ సినిమా ఇటీవల ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక పఠాన్ సినిమా విజయంతో ధైర్యం తెచ్చుకున్న ఎంతో మంది హీరోలు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ త్వరలో తూ జూటి మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇందులో బిబిసి రిపోర్టర్ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగింది. బాలీవుడ్ ఇంకా డల్ గానే ఉంది కదా అంటూ అడగడంతో.. రణ బీర్ స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మీరు పఠాన్ కలెక్షన్స్ చూడలేదా.. ఏం మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించాడు.. వెంటనే మీరు ఏ పత్రికకు చెందినవారు అంటూ అడిగాడు. బీబీసీ అని రిపోర్టర్ చెప్పగా.. మీ ఆఫీసులో ఏం జరుగుతుంది.. బయటకు చెబుతున్నారా.. ఏదో జరుగుతుంది దాని గురించి ముందు మీరు చెప్పండి అంటూ రిపోర్టర్ ప్రశ్నకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు రణబీర్ కపూర్.