మొన్నటి వరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక రాంచరణ్ ఎక్కడైనా కనిపించాడు అంటే చాలు సినీ అభిమానులు అందరూ కూడా చూసి తెగ మురిసి పోతూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు త్రిబుల్ ఆర్ సినిమా అంతర్జాతీయ వేదికలలో పలు అవార్డులను సొంతం చేసుకుంటూ ఇక ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి.


 కాగ గతంలో ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు అవార్డు రాగా.. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో భాగంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు అటు కూడా అంతర్జాతీయ వేదికపై మెరిసారు అని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. ఇక ఈ పురస్కారాలను అతి త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా గుడ్ మార్నింగ్ అమెరికా అనే కార్యక్రమంలో కూడా పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి టాలీవుడ్ హీరోగా నిలిచాడు.



 ఇకపోతే ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ యాంకర్ రామ్ చరణ్ ను హాలీవుడ్ నటుడితో పోల్చారు. అందుకు చరణ్ కూడా ఆసక్తికర సమాధానం చెప్పాడు అని చెప్పాలి. ఇక ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం రామ్ చరణ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ క్రమంలోనే చరణ్ పరిచయం చేస్తూ ఇక బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా గా అభివర్ణించింది యాంకర్. ఈ క్రమంలోనే స్పందించిన చరణ్.. నాకు బ్రాడ్ పిట్ అంటే ఎంతో ఇష్టం అంటూ చరణ్ సమాధానం చెప్పాడు. ఇక చరణ్ చెప్పిన సమాధానం ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని చెప్పాలి. కాగా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: