బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రణబీర్ కపూర్ గత సంవత్సరం బ్రహ్మాస్త్ర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రం లో ఆలియా భట్ కూడా నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకొని ఒక పండంటి పాపకు కూడా జన్మనిచ్చారు. ప్రస్తుతం రణబీర్ తూ ఘతి మైన్ , మక్కార్ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. రణబీర్, శ్రద్ధా కపూర్ కలిసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నారు.రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను వివాహం చేసుకున్నారు. రాహా అనీ తన కూతురు పేరు కూడా పెట్టడం జరిగింది. రాహు తో ప్రస్తుతం ఇద్దరు హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆలియా భట్ త్వరలోనే జాయిన్ అవ్వనుంది. అయితే రణబీర్ కూతురు పుట్టినప్పటినుంచి ఎక్కువగా షూటింగ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దీంతో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ రణబీర్.. ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలనుకుంటున్నాను తన కూతురు రాహ పుటినప్పటి నుంచి సరిగ్గా తనకి టైమును కేటాయించలేకపోతున్నాను.. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

సందీప్ తో చేసే యానిమల్ షూట్ లో తన పాత్ర సూట్ త్వరలో అయిపోతుంది. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు లీవ్ తీసుకుంటున్నాను ఆరు నెలల వరకు ఎలాంటి సినిమాలు చేయనని ఆరు నెలలు నా కూతురు కోసం కేటాయిస్తున్నాను అంటూ తెలిపారు. తనతో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటానని తెలిపారు. రణబీర్ త్వరలో  అన్నిటికీ గ్యాప్ ఇచ్చి ఇంట్లో తన కూతురితో ఎక్కువ సమయాన్ని కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపుగా యానిమల్ సినిమా ప్రమోషన్లలోనే రణధీర్ కనిపించబోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: