ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ కేవలం ఒక్క భాషలోనే కాకుండా పలు భాషలలో కథలను ఒడిసిపట్టి మరి సినిమాలను చేస్తున్నారు. అలాగే కథలకి పరిధిలో లేకుండా ఇతర భాషలలో కూడా వాటిని విడుదల చేస్తూ ఉండడంతో బాగా పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సైతం చేస్తున్నారు. ఈ పద్ధతి హీరోయిన్స్ కు కూడా బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి.. మొదటి మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.


ఇక ఆ తర్వాత నటించిన మూడు చిత్రాలు కూడా డిజాస్టర్ కావడం జరిగింది. దీంతో ఈ అమ్మడు కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఇమే సినిమా లైన్ అప్ చూస్తూ ఉంటే అందరికీ షాక్ అయ్యే విధంగా కనిపిస్తోంది. చేతిలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న కష్టడీ సినిమా మాత్రమే ఉంది అనుకున్నారు.అయితే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నటుడు శర్వానంద్ తో మరొక సినిమాని మొదలుపెట్టింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే తమిళంలో హీరో సూర్యగా తెరకెక్కిస్తున్న ఒక పాన్ ఇండియా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

ఈ రెండు చిత్రాలతో పాటు మరొక ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ట్వినో తామస్ హీరోగా తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఖరారు అయినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మైత్రి మూవీస్ మేకర్స్ మలయాళం లో అడుగు పెట్టబోతున్నది. ఇలా రెండు పాన్ ఇండియా చిత్రాలతో మూడు భాషలలో కృతి శెట్టి హవా తగ్గలేదని నిరూపించుకుంటోంది .ఒకవేల ఈ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అంటే ఈ ముద్దుగుమ్మ కెరియర్ కచ్చితంగా మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: