బాలయ్య కొత్తగా ట్రై చేసేందుకు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ కూడా అస్సలు పట్టించుకోడు..

స్టేజిపై పాట పాడిన కానీ శ్లోకం చెప్పినా మరేం చేసినా కూడా తనకు తానే సాటి అన్నట్లుగా బాలకృష్ణ ఎన్నో సార్లు అయితే నిరూపించుకున్నాడు, టాక్ షో విషయంలో స్టార్ హీరోలు వెనకాడుతుండగా బాలకృష్ణ ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం రెండు సీజన్స్ ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయని తెలుస్తుంది.ఇక బాలకృష్ణ ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే ప్రచారం అయితే జరిగింది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని కూడా వార్తలు అయితే వచ్చాయి. బాలకృష్ణ వెబ్ సిరీస్ నిజమే కానీ అది ఇప్పట్లో  అయితే ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం అనిల్ రాంపూడి దర్శకత్వంలో సినిమా తో బాలయ్య చాలా బిజీగా ఉన్నాడు.

ఈ సంవత్సరం చివర్లో బాలయ్య కొత్త సినిమాను మొదలు పెట్టాల్సి ఉందట.ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కనుక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు బాలకృష్ణకు ఎక్కువ సమయం  కూడా లేదు. అందుకే వెబ్ సిరీస్ ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలు పెట్టాలని అయితే భావిస్తున్నాడు.ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎన్నికల హడావుడి ఉండదు. అందుకే ఆయన సినిమాలపై మరియు సిరీస్ పై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే బాలయ్య మంత్రి పదవి పొందే అవకాశాలు కూడా ఉంటాయని.. దాంతో సినిమాలకు దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కొందరు అభిప్రాయం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా కాలంగా ఆయనని మంత్రిగా చూడాలని అయితే కోరుకుంటున్నారు. మంత్రిగా చేసినా ఆయన సినిమాలు చేయాల్సిందే అంటూ కొందరు కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: