ఈరోజు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా ఖుషి మూవీ నుండి నా రోజా నువ్వే ఫుల్ సాంగ్ విడుదలైంది. విజయ్ దేవరకొండ - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాని 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సెన్సిటివ్ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.నానితో  కమర్షియల్ గా తీసిన 'టక్ జగదీశ్' సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ తన స్టైల్ లో ప్రేమ కథని తెరపై చూపించాలని భావుస్తున్నాడు శివ నిర్వాణ. ఈసారి ఎలాగైనా ఖుషి సినిమా హిట్టుతో మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే వరుస ప్లాపుల్లో వున్న విజయ్, సమంత కూడా ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండగా..మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం తో సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.


రీసెంట్ గా సమంత అనారోగ్యం నుండి బయటపడడంతో మళ్లీ టీం షూటింగ్ మొదలుపెట్టుకుంది.సెప్టెంబర్ 1 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో నేడు సినిమాలోని 'నా రోజా నువ్వే' అంటూ సాగే ఓ చక్కటి పాట ను రిలీజ్ చేసారు. మొత్తం ఐదు భాషల్లో ఈ పాట రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో సమంత విజయ్ ఇద్దరి కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ను మలయాళ సంగీత దర్శకుడు  హేషామ్ అబ్దుల్ వాహాబ్ ఆలపించారు.అలాగే ఖుషీ మూవీకి హేషామ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్ లో సమంత కశ్మీరీ ముస్లిం యువతిగా చాలా అందంగా పద్దతిగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ వ్యవహారమే నేపథ్యంగా ఖుషీ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇక పాట విషయానికి వస్తే చాలా ఫ్రెష్ గా వినసొంపుగా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: