లైగర్ చిత్రం ఫలితం దర్శకుడు పూరీ జగన్నాథ్ ను హీరో విజయ్ దేవరకొండని ఎంతగా షాక్ కి గురి చేసిందో చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఫలితం విజయ్ ని వదిలిపెట్టినా పూరిని మాత్రం నిను వీడని నీడ లాగా వెంటాడుతూనే ఉంది. సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసి ఏడాది దాటుతున్న కూడా పూరీ జగన్నాథ్ ని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఎగ్జిబిటర్ల రూపంలో ఇంకా వెంటాడుతోంది.లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. దీంతో లైగర్ చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్న పూరిజగన్నాథ్ నష్టాలను కొంత భరించేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఇచ్చిన హామీను పూరజగన్నాథ్ మాత్రం ఏమాత్రం నెరవేర్చలేదు.ప్రస్తుతం పూరిజగన్నాథ్ లైగర్ చేదు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి తన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ఇప్పుడు రెడీ అయ్యాడు. ఈ సినిమాని మే15 వ తేదీన ప్రకటించబోతున్నారు.


ఈ తరుణంలోనే లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయండి అంటూ ఎగ్జిబిటర్స్ ఇంకా అలాగే లీజర్స్ అసోసియేషన్ ఫిలిమ్ ఛాంబర్ ముందు రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు. లైగర్ సినిమా వల్ల చాలా కష్టాల్లో కూరుకుపోయామని..తమకు రూ.9కోట్లు తిరిగి ఇస్తానని పూరీ హామీ ఇచ్చారని కానీ ఆరు నెలలు గడిచినా కూడా ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా ఇవ్వలేదని లీజర్లు ఎంతగానో ఆరోపిస్తున్నారు. మరి ఈ దీక్షపై పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.చాలా ఓవర్ కాంఫిడెన్స్ తో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని అన్ని రాష్ట్రాలు తిరిగి ఓవర్ గా ప్రచారం చేశారు. కానీ ఈ సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వణ దర్శకత్వంలో ఖుషి అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: