2016లో ‘నేను శైలజ’ సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేష్ అనతి కాలంలోనే మలయాళం, తమిళ, తెలుగు పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌ గా మారింది. సినిమాల్లోకి రాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన కీర్తికి ఫ్యాషన్ డిజైనర్‌ గా స్థిరపడాలనుండేదట.  ఇప్పుడు కీర్తి వరస సినిమాలతో బిజీగా ఉంది. అందులో కొన్ని పూర్తైపోయాయి కూడా. అయితే లాక్‌ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు.

కానీ ఓటిటిలో ఆమె సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయని అనుకున్నా మళ్ళీ థియేటర్స్ పెన్ చేయడంతో కాస్త సందిగ్దత నెలకొంది. కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖి` అని నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. ఇవి కాక ఆమె నితిన్ రంగ్ దే లో కూడా నటిస్తోంది. అలానే మహేష్ బాబు - పరశురామ్ సినిమా అయిన సర్కారు వారి పాటలో కూడా ఆమె నటించనుంది. అయితే ఆమె ప్రస్తుతానికి బిజీబిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన రెమ్యునరేషన్ తగ్గించి షాకిచ్చింది కూడా.

అయితే అందుతున్న సమాచారం మేరకు ఆమెకు సర్కారు వారి పాట కోసం కోటిన్నర దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు - పరశురామ్ సినిమా అయిన సర్కారు వారి పాట అక్కడే ప్లాన్ చేశారు. అమెరికాలోని డెట్రాయిట్ రాష్ట్రంలో ఈ సినిమాని 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడనికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి మొన్నటి దాకా ఖాళీగా ఉన్న కీర్తి ఇప్పుడు వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ రెమ్యునరేషన్ ఆమె పెంచిందా ? లేక యూనిట్ అంత ఫిక్స్ చేసిందా ? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: