ఇక మెగాస్టార్ ఇప్పుడు క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు.. అలాగే మరో పక్క మలయాళం బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్లో నటించనున్నాడు. మొదట ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆ బాధ్యతలు తమిళ దర్శకుడు మోహన్ రాజా తీసుకున్నాడని తెలిసింది. ఈ మూవీ ఒరిజినల్ వర్షన్లో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా నటించారు. ఇందులో మోహన్ లాల్ పాత్రకు హీరోయిన్ ఉండదు. లూసీఫర్ రీమేక్లో అదే మోహన్ లాల్ పాత్ర మెగాస్టార్ చేస్తున్నాడు.
దీంతో తెలుగు అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా రూపొందించాలని తెలుగు వర్షన్లో హీరోయిన్ని పెట్టాలని భావించిన మేకర్స్.. చివరకు చిరంజీవితో సంప్రదింపులు జరిగి హీరోయిన్ లేకుండాగానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారట. సూపర్ హిట్ అయిన మాతృకకు పెద్దగా మార్పులు చేయకుండా తీస్తేనే బెటర్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ విషయం బయటకు రావడంతో హీరోయిన్ లేకుండా మెగాస్టార్ సినిమా చేయడం కొంతవరకు రిస్కే అంటున్నారు ప్రేక్షకులు.కొంతమంది చిరంజీవి తీసుకున్న డేరింగ్ స్టెప్ కి మెచ్చుకుంటున్నారు. చూడాలి మరి లూసీఫర్ రీమేక్ ఎలా ఉంటుందో... ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...