నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కి లక్ ఫాక్టర్ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి.. ఎందుకంటే అయన చేసిన మూడు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.. తొలి సినిమా అఖిల్ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను అయితే ప్రేక్షకులు అస్సలు మెచ్చలేదు.. దాంతో ఈ సారి హిట్ కొట్టకపోతే ప్రజలు గుర్తుంచుకుపోయే పరిస్థితి లేదు.. దాంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా ని చేస్తున్నాడు..

టాలీవుడ్ లో అందరు హీరోలు వరుస సినిమాలు చేయడమే కాదు సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకో హిట్ కొడుతూ తమ కెరీర్ ను బాలన్స్ చేసుకుంటూ పోతున్నారు.. కొత్త హీరోలు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు సైతం యావరేజ్ హిట్స్ తో అయినా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.. అయితే అక్కినేని అఖిల్ ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా హిట్ కొట్టలేకపోతున్నాడు.. ఇటీవలే అయన నటిస్తున్న నాలుగో సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.. ఆ టీజర్ కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది..

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట.ఇప్పటిదాకా హీరోయిన్ ఒక్క పూజా హెగ్డేను ఉందనుకుంటున్నాం కానీ ఇందులో మరో బ్యూటీ కూడా ఉందట. తనే నేహా శెట్టి. తన కొడుకు ఆకాష్ తో పూరి జగన్నాధ్ తీసిన మెహబూబాతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే అది డిజాస్టర్ కావడంతో తనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.  మరి ఈ సినిమా ఆమెకు లైఫ్ ఇస్తుందా చూడాలి. 2021 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకా డేట్ ని అనౌన్స్ చేయలేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: