చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమల హీరోలే కాకుండా ఇతర భాషల హీరోలు కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. తాజగా సుపర్ స్టార్ అల్లుడు ధనుష్ పాన్ ఇండియా సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన కమ్ముల కాంబినేషన్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. అయితే ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో ధనుష్ ఫ్యాన్స్, శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటివరకు శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో ఒక్క సినిమాను కూడా తీసింది లేదు. శేఖర్ కమ్ముల తొలిసారి స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించనుండటం గమనార్హం అనే చెప్పాలి. అయితే గతంలో ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథను శేఖర్ కమ్ముల ధనుష్ కు చెప్పి ఒప్పించినట్లు  తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ధనుష్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాదు.. ఈ మూవీలో నటించడం గురించి ధనుష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించడానికి తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని తెలియజేశారు. అయితే మూడు భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమా కొరకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ధనుష్ వెల్లడించారు. అంతేకాదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా సాయిపల్లవి నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: