మటన్ అంటే ఇష్టమంటున్న ఓ భార్యని బ్రాహ్మణుడైన ఓ భర్త అడిగిన ప్రశ్న ఇది. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి బ్రాహ్మణుడే.. అయినా అమ్మాయి మటన్ తింటుందని తెలిసినా అందంగా ఉందన్న ఒక్క కారణంతో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె పెళ్లైయ్యాక మటన్ తినడం మానేస్తానని చెప్పింది. . తీరాచూస్తే ఆమె మటన్ తినడం మానలేదు. ఆమె ఎవరికీ తెలియకుండా మాంసాహారం తినేస్తోంది. ఈ విషయం తాజాగా ఆమె భర్తకు తెలిసిపోయింది.
బ్రాహ్మణుడైన ఓ భర్త తన భార్యతో మటన్ కావాలో, తాను కావాలో తేల్చుకోమని చెప్పాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా జరిగిన ఓ సంభాషణతో ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ను ఆ వ్యక్తి ట్విట్టర్లో సాయం కోరాడు. అతని సమస్య విన్న శిరీష్కి ఏం చెప్పాలో తెలీలేదు. ‘కంగ్రాట్స్. ఇలాంటి లవ్ స్టోరీ వినడం ఇదే మొదటిసారి.
కానీ ఒకటి గుర్తుపెట్టుకో. మనుషులు ప్రేమ లేకుండా అయినా ఉండగలరు కానీ ఆహారం లేకుండా ఉండలేరు కదా’ అని సమాధానం ఇచ్చాడు. శిరీష్కి ఆ వ్యక్తి మధ్య ట్విటర్ సంభాషణ చూసి ఇంతమంది సెలబ్రెటీలు ఉన్నప్పుడు అతను శిరీష్ సాయమే ఎందుకు కోరినట్లో అని కామెంట్స్ చేశారు. ఈ ట్విట్టర్ సంభాషణకి విపరీతంగా స్పందన వస్తోంది.