ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మనకి కొత్త కాదు .. ఎప్పుడు ఎవరు ఏవైపు ఉంటారు అనేది అర్ధం కానట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎన్నికల టైం లో జగన్ మోహన్ రెడ్డి మాటలాడే ప్రతీ మాటా ఆసక్తికరంగా మారింది .. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కే ఏ పాల్ గురించి ఉతికి ఆరేసారు.


పవన్ కళ్యాణ్ ని యాక్టర్ అంటూ కే ఏ పాల్ ని పార్టనర్ అంటూ కుమ్మేసాడు జగన్. జగన్ వాళ్ళిద్దరినీ తూర్పార బెడుతూ ఉంటె జనం నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కనపడింది. " జగన్ తో పెట్టుకుంటే నాశనం అయిపోతాం అని వాళ్లకి ముందే తెలుసు. సామాజిక వర్గాల పరంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు ..


చంద్రబాబు కి మంచి చెయ్యడం కోసం ఓట్లు చీల్చడం కోసం కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి.. వైకాపా కండువాలని వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా .. చంద్రబాబే వీళ్ళకి ప్రొడ్యూసర్ గా మారాడు.



ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎన్నికల్లో జనాల్ని డబ్బులతో కొందాం అనుకుంటున్నాడు .. కానీ తిరగబడండి .. డబ్బుకోసం కాదు మేము అని నిరూపించండి. " అంటూ కే ఏ పాల్ నీ పవన్ కళ్యాణ్ నీ ఉతికి ఆరేసారు జగన్ మోహన్ రెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: