మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచి మనసా వాచా కర్మణా అంటూ ప్రమాణం చేసి.. పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భర్త ప్రమాణం చేస్తాడు. కానీ నేటి రోజుల్లో భర్త చేసిన ప్రమాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడం కాదు కదా.. భర్త భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. భార్యకు ఏం సమస్య వచ్చినా ముందుండి ఎదుర్కోవాల్సిన భర్త.. చివరికి తానే సమస్యగా మారిపోతున్నాడు. రోజుకు ఇలాంటి ఘటనలు తెరమీదకి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే.



 పెళ్లి చేసుకుని కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టి దాంపత్య జీవితాన్ని గడపాలి అనుకుంటున్న ఎంతోమంది మహిళలకు కొన్ని రోజుల్లోనే ఊహించని ఘటనలతో చిత్రహింసలు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు కొంతమంది అదనపు కట్నం తీసుకు రావాలి అనే కారణంతో కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటే మరికొన్ని చోట్ల శాడిస్టులుగా  వ్యవహరిస్తున్న భర్తలు కట్టుకున్న భార్యను దారుణంగా హింసిస్తున్న  సంఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఓ శాడిస్టు భర్త యవ్వారం  బయట పడింది. ఏకంగా కట్టుకున్న భార్యను దారుణంగా హింసించి పైశాచికంగా ఆనందాన్ని పొందాడు భర్త.



 ఏకంగా భార్యను ఏడాదిన్నర కాలం పాటు టాయిలెట్లో బంధించి పైశాచిక ఆనందం పొందిన భర్త గుట్టురట్టు కావడంతో ఇటీవలే రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి తోశారు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. పానిపట్ ప్రాంతంలో... ఓ భర్త భార్యను టాయిలెట్లో బంధించి రాక్షసానందం పొందాడు. ఇక ఏకంగా 15 రోజులకు ఒకసారి టాయిలెట్ నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ కొద్దిసేపటికే టాయిలెట్ లోకి పంపించి బంధించాడు. తిండి పెట్టకుండా నే దారుణంగా వేధించేవాడు. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు శాడిస్ట్ భర్త ను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: