కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరి చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రను బోగస్ యాత్ర అని విమర్శించారు. కేవలం అధికారమే పరమావధిగా ఉండే బాబుకు ప్రజా సమస్యలు అస్సలు పట్టవని, అధికార పీటం పైనే ఆయన ధ్యాస అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని , దీని ఫై బాబుకు ఎందుకు ఏడుపని ప్రశ్నించారు.  పనిలోపనిగా జగన్ కు కూడా చురకలంటించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఒక్క మనిషి సొత్తు కాదని, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు లేకుంటే అవి ముందుకు వేళ్ళేవే కావని పురందరేశ్వరి అన్నారు. మొత్తానికి చిన్నమ్మ క్యాబినెట్ హోదా మంత్రి అయిన తరువాత మరింత ఆత్మ విశ్వాసంతో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: