ఉదయం పదిన్నర కు మరోసారి వీడియో కాల్ వచ్చిందని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇండియా పై దుర్భాషలాడారని తెలిపింది. తనను తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకోవాలని వెల్లడించింది. మరో వైపు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రామాదేవి చెబుతోంది. అంతే కాకుండా బైంసా అల్లర్ల వెనక రోహింగ్యాల హస్తం ఉందంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అసలు బైంసా అల్లర్లతో సంబంధంలేని అమాయక హిందువులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారని ఆరోపిస్తోంది. హిందువులను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వెంటనే వారిని విడుదల చేయాలని రమాదేవి డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన అనంతరం హిందువుల అరెస్ట్ సంఖ్య పెరిగిందని రమాదేవి ఆరోపించారు. వెంటనే హిందువులను విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఉదయం పదిన్నర కు మరోసారి వీడియో కాల్ వచ్చిందని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇండియా పై దుర్భాషలాడారని తెలిపింది. తనను తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకోవాలని వెల్లడించింది. మరో వైపు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రామాదేవి చెబుతోంది. అంతే కాకుండా బైంసా అల్లర్ల వెనక రోహింగ్యాల హస్తం ఉందంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అసలు బైంసా అల్లర్లతో సంబంధంలేని అమాయక హిందువులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారని ఆరోపిస్తోంది. హిందువులను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వెంటనే వారిని విడుదల చేయాలని రమాదేవి డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన అనంతరం హిందువుల అరెస్ట్ సంఖ్య పెరిగిందని రమాదేవి ఆరోపించారు. వెంటనే హిందువులను విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.