విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సిఎం 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు అని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం అని అన్నారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం అని ఆయన స్పష్టం చేసారు. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాం అని అన్నారు విద్యాశాఖా మంత్రి.

కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది అని ఈ సందర్భంగా వెల్లడించారు. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా మేము కోరాం అని ఆయన అన్నారు. కోవిడ్ నివందనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని తెలిపారు. స్వీయ నియంత్రణతో కరోనా నుండి కాపాడుకో వచ్చు అని స్పష్టం చేసారు.

ఉపాధ్యాయులు కూడా కరోనా కు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన అన్నారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసారు.  టీడీపీ మొండి వైఖరితో ముందుకు వెళుతుంది అని మండిపడ్డారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది అని ఆయన న్నారు. లోకేష్ ఏమి సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని అంటున్నారు అని పరీక్షలు రాయకపోతే  ఏమైనా కరోనా రాదు అని గ్యారంటీ ఉందా అని నిలదీశారు. కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అని అన్నారు. జులై లో మరో సారి సమీక్షించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. 10 తరగతి విద్యార్థులు కి ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap