మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న పలువురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో... వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు... సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. కేసుకు సంబంధించిన విషయాలపై సీబీఐ అధికారులతో చర్చించారు. హత్య కేసు విచారణలో భాగంగా ఈ రోజు పలువురిని విచారించారు అధికారులు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ లను అధికారులు విచారించారు. ఇప్పటికే సునీల్ యాదవ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న అధికారులు... కడప కేంద్ర కారాగారంలోనే తమ విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు కేసు విచారణలో జాప్యం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. కేసు విచారణను త్వరగా ముగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న పలువురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో... వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు... సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. కేసుకు సంబంధించిన విషయాలపై సీబీఐ అధికారులతో చర్చించారు. హత్య కేసు విచారణలో భాగంగా ఈ రోజు పలువురిని విచారించారు అధికారులు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ లను అధికారులు విచారించారు. ఇప్పటికే సునీల్ యాదవ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న అధికారులు... కడప కేంద్ర కారాగారంలోనే తమ విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు కేసు విచారణలో జాప్యం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. కేసు విచారణను త్వరగా ముగించాలని డిమాండ్ చేస్తున్నారు.