బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ని దాదాపు అందరు నమ్ముతూనే ఉంటారు. వందల ఏళ్ళ కిందట భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి ముందుగానే చెప్పారు. అయితే బ్రహ్మం గారు చెప్పింది అంతా ట్రాష్ అని కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు. కానీ కాలజ్ఞానం లో రాసిన ఎన్నో విషయాలు జరగడంతో ఎంతోమంది బ్రహ్మంగారి కాలజ్ఞానంని నమ్మడం కూడా మొదలుపెట్టారు. ఇక బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఒకటి జరుగుతూ వస్తోంది. దీంతో ఇక అందరూ కాలజ్ఞానాన్ని చదువుతూ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

 అయితే ఇక మన దగ్గర అచ్చం బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాగో బల్గేరియాలో కూడా వంగా బాబా  ను అక్కడి ప్రజలు అంతలా విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఆమె కూడా భవిష్యత్తులో జరగబోయేవి చెబుతూ ఉండేదట. ఆమె చెప్పిన ఎన్నో విషయాలు కూడా నిజం అయ్యాయి అని చెబుతూ ఉంటారు  అక్కడి ప్రజలు. ఇక ఎన్నో విపత్తులను ముందుగానే చెప్పిందని కూడా అక్కడి ప్రజలు అంటూ ఉంటారు. ఈమె అనారోగ్యం బారిన పడి 1996లో ప్రాణాలు వదిలారు. అయితే బ్రతికుండగా ఇక భవిష్యత్తు గురించి ఆమె ఎన్నో విషయాలను చెప్పారని ఆమె అంచనాలు నిజమయ్యాయి అంటూ చెబుతున్నారు.


 అమెరికాలో సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడుల గురించి కూడా వంగ బాబా ముందుగానే చెప్పారు అంటూ అక్కడి ప్రజలు అంటున్నారు.. అంతేకాకుండా బ్రెగ్జిట్, 2004 సునామీ ముందే ఊహించి చెప్పారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కలవరపెడుతున్న అంశం ఏంటంటే 2022 లో నైజీరియాలో కొత్త వైరస్ వస్తుందని అంతేకాదు అక్కడి ప్రజలపై ఏలియన్స్ దాడులకు పాల్పడ్డారు అని కూడా ఆమె చెప్పడం గమనార్హం. దీంతో 2022 సంవత్సరం వస్తుంది అని ఆనంద పడుతున్న వారి కంటే ఏం జరగబోతుందో అని భయంతో వణికిపోతున్నవారే ఎక్కువైపోయారు బల్గేరియాలో. ఇక ఆమె చెప్పిన మాటలు కూడా ప్రస్తుతం అక్కడి మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: