తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి అంగ ప్రదక్షణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందించనున్నారు. తిరుమల శ్రీవారి భక్తుల కు ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెబ్ సైట్‌లో పేర్కొంది.

ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయిచనున్నట్లు గా వెల్లడించింది. అంగ ప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు.. అర్థరాత్రి దాటిన తర్వాత పుష్కరిణి లో పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టల తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయం లోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందు గానే వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగ ప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.

తిరుమల లో రెండేళ్లుగా అంగప్రదక్షిణ టోకెన్లు నిలిచిపోయాయి. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం తో ఏప్రిల్ నెల నుంచి మళ్లీ ఈ టోకెన్లను టీటీడీ అందిస్తోంది. అయితే సీఆర్ఓ కార్యాలయం లో ఆఫ్ లైన్ లో అందుబాటు లో ఉండేవి. జూలై నుంచి ఆన్ లైన్ లో అంగ ప్రదక్షిణ టికెట్లు అందిస్తున్నారు. అయితే ఇకముందు నేరుగా టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఇకపోతే ప్రయాణికుల రద్దీని దృష్టి లో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. రైలు సర్వీసులను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికు ల రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్ల ను నడుపనున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడవనున్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: