సాధారణంగా గ్రామీణ క్రీడ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కబడ్డీ. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా కబడ్డీ ఆడటానికి ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇటీవలి కాలంలో అయితే ఎంతో మంది గ్రామీణ యువకులు సైతం జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే కాస్త వయసు మీద పడిపోయిన వారు కబడ్డీకి  దూరంగానే ఉంటారు. ఎందుకంటే ఏదైనా గాయం అయిందంటే చాలు చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కబ్బడ్డీ ఆడిన కేవలం యువకులు మాత్రమే ఆడుతూ ఉంటారు అని చెప్పాలి.

 కానీ వృద్ధులు వర్సెస్ యువకులు కబడ్డీ  ఆడే సమయం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటి వరకు కొంత మంది చూసే ఉంటారు. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.  ఇక్కడ కబడ్డీ ఆడుతున్న వారిలో దాదాపు 20 నుంచి 25 ఏళ్ల కుర్రాళ్ళు  మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా పాతికేళ్ళ వయసు కలిగిన కుర్రాళ్ళతో 60 ఏళ్ల వయస్సు కలిగిన   వృద్ధులు కబడ్డీలో పోటీ పడ్డాడు. ఇక ఇది చూసి అందరూ ఆశ్చర్య పోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజస్థాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 44 వేల కంటే ఎక్కువ గ్రామాలలో నెలరోజులపాటు రాజీవ్ గాంధీ గ్రామీణ క్రీడలను నిర్వహిస్తోంది.

 ఇక ఈ క్రీడలో పాల్గొనేందుకు 30 లక్షలకు పైగా గ్రామీణ క్రీడాకారులు తమ పేరును నమోదు చేసుకోవడం గమనార్హం.  అయితే రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కబడ్డీ ఆటలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఓ గ్రామంలోగురు యువకులు వర్సెస్ వృద్ధులు మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి. ఇక్కడ వృద్ధులు యువకులతో పోటీపడుతూ కబడ్డీ ఆడారు.  యువకులకు మేము ఎక్కడ తక్కువ కాదు అన్న  విధంగానే ఎనర్జీతో కనిపించారు.ఇక ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిన అంకుల్ ఇస్ ద టైగర్ అని ఒక నటించిన రాసుకు వచ్చాడు మృతులైన అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.  ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారి పోవడంతో ఆ వృద్ధుల ఎనర్జీ చూసి షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: