ఇప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్స్ లలో పాన్ కార్డు కూడా..ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా కావాల్సిన గుర్తింపు కార్డు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ 10 అంకెల కార్డు ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది.ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నీ పాన్‌ కార్డ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా ఎంతో ముఖ్యపాత్ర పోషించే పాన్‌ కార్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు..అయితే పాన్ కార్డు విషయంలో కొన్ని తప్పులను మాత్రం చెయ్యకూడదు.. చే స్తే భారీ జరిమానాను చెల్లించుకోవాలి..అవేంటో ఇప్పుడు చూద్దాం..


ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే సమయంలో ఎవరైనా తప్పుడు పాన్‌ వివరాలను అందిస్తే ఐటీ శాఖ రూ. 10,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐటీఆర్‌ ఫామ్‌ను ఫిల్ చేసే సమయంలో పాన్‌ వివరాలను సరిగ్గా అందించాల్సి ఉంటుంది. ఇక ఒక వ్యక్తికి రెండు పాన్‌ కార్డులు ఉన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాన్‌ దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో అందదు, దీంతో వెంటనే మరోసారి అప్లై చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లోనే రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటారు. అయితే అయితే ఒక వ్యక్తి రెండు పాన్‌ కార్డులు కలిగి ఉండడం నిబంధనలకు వ్యతిరేకం..


ఈ విషయాన్ని ప్రతిసారి చెబుతున్నారు.. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు.రెండో పాన్‌ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధానాల్లోనూ సరెండర్‌ చేయవచ్చు. ఇందుకోసం ఇన్‌కమ్‌ టాక్స్‌ వెబ్‌సైట్‌ లో అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్పులు/కరెక్షన్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫామ్‌ను నింపి నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజటరీ లిమిటెడ్‌కు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. రెండో పాన్‌కార్డ్‌ను సరెండర్‌ చేసే సమయంలో కార్డును సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది..ఒకవేళ  రెండో కార్డు చెల్లించకుంటే రూ.10 చెల్లించాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: