ప్రపంచాన్ని వణికించిన అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్‌ ఇబ్రహీం పాకిస్థానీ పఠాన్ మహిళను మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయాన్ని దావూద్‌ సోదరి హసీనా పార్కర్ కుమారుడు, దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దావూద్‌ మొదటి భార్య మైజాబిన్‌ను గతంలోనే పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్‌ పఠాన్‌ మహిళను దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు అలీ షా పార్కర్‌ అధికారుల ముందు చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే దావూద్‌ తన మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వలేదని కూడా తెలిపాడు.ఇక ఉగ్రవాద నిధుల కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, అలీషా తన ప్రకటనలో దావూద్ కుటుంబ వివరాలను తెలిపాడు. అందులో గ్యాంగ్‌స్టర్ తన స్థావరాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలోని మరొక ప్లేస్ కి మార్చుకున్నాడని ఎన్‌ఐఏ నివేదికలో తెలిపింది.


ఇక ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దావూద్ ఇబ్రహీం ఇంకా అలాగే అతని సన్నిహితులపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి కొంతమందిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని బడా నేతలు ఇంకా అలాగే వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని రెడీ చేస్తున్నట్లు ఎన్ఐఏకు సమాచారం అందింది. వారు పెద్ద నగరాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడే ఛాన్స్ ఉందని… ఈ కేసు దర్యాప్తు సందర్భంగా దావూద్ ఇబ్రహీం తన మేనల్లుడు అనగా తన సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ నమోదు చేసింది.అలీషా చేసిన ప్రకటన ప్రకారం, దావూద్‌కు నలుగురు సోదరులు ఇంకా అలాగే అతనితో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక దావూద్ ఇబ్రహీం మళ్లీ వివాహం చేసుకున్నాడు. అతని రెండో భార్య పాకిస్తానీ పఠాన్ అని అలీషా ఎన్‌ఐఏ విచారణలో తెలిపాడు. ఇప్పుడు అతను కరాచీలోని డిఫెన్స్ కాలనీలో ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని అలీ షా ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: