ముషీరాబాద్ డివిజన్లోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్ అన్నారు. మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాలని, అప్పుడే ముషీరాబాద్ డివిజన్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కార్పొరేటర్గా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. డివిజన్లో టీఆర్ఎస్ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి తప్పదని ఆమె పేర్కొన్నారు.
ముషీరాబాద్ డివిజన్లోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్ అన్నారు. మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాలని, అప్పుడే ముషీరాబాద్ డివిజన్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కార్పొరేటర్గా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. డివిజన్లో టీఆర్ఎస్ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి తప్పదని ఆమె పేర్కొన్నారు.