అమరావతి  : ఇళ్ల నిర్మాణం పై మంత్రులు బొత్స, శ్రీ రంగనాథ రాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు మాట్లాడుతూ..  సీఎం జగన్ 12 వేల కోట్లతో పేదల ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించారన్నారు.  30 వేల ఎకరాలు పేదల ఇళ్ల కోసం సేకరించామని.. ఇప్పుడు లే ఔట్లు గా అభివృద్ధి చేసి, మొత్తం సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.  

30 లక్షల మందికి ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు సిమెంట్ అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు.. ఐరన్, మెటల్ ని తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.  ఎమ్మెల్యేలతో చర్చించి క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకున్నామని తెలిపారు. వీటన్నింటిని సీఎం వై ఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు. ముందు లే ఔట్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని.. లబ్ధిదారులకు వాళ్లకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

 గతంలో 240 చదరపు అడుగులు ఇచ్చేవారు..ఇప్పుడు 340 చదరపు అడుగులు ఇస్తున్నామని.. లబ్ధిదారుల ప్రాధాన్యత ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.  32 వేల కోట్లతో శాశ్వత డ్రైనేజీ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని.. కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నామని ప్రకటించారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు.  దేశంలో ప్రతి నాలుగు ఇళ్లలో మన రాష్ట్రంలో ఒక ఇల్లు తెచ్చుకుంటున్నామని చెప్పారు. సిఎం జగన్ పాలనలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జగన్ పరిపాలనను కోరుకున్నారని చెప్పారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు. 

మరింత సమాచారం తెలుసుకోండి: