ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్... క్రికెట్ దిగ్గజం కుమారుడు అయిన అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు. అయితే సీజన్ కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ను కనీస ధర రూ. 20 లక్షల కు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 11 మ్యాచ్ లలో ఒక్కదానిలో కూడా అర్జున్ టెండూల్కర్ జట్టు తరపున బరిలోకి దిగలేదు. అయితే అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్ సిమర్ జీత్ సింగ్ను జట్టులో చేర్చుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఇండియన్ ప్రీమియర్ మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ ను పూర్తి చేసిన తర్వాత ఈ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ యూఏఈలో జట్టుతో శిక్షణ ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడే సిమర్జీత్ సింగ్, ఇటీవల వైట్-బాల్ పర్యటన కోసం శ్రీలంక కు వెళ్లిన భారత జట్టు నెట్ బౌలర్లలో ఒక్కడిగా వ్యవరించాడు.
ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్... క్రికెట్ దిగ్గజం కుమారుడు అయిన అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు. అయితే సీజన్ కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ను కనీస ధర రూ. 20 లక్షల కు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 11 మ్యాచ్ లలో ఒక్కదానిలో కూడా అర్జున్ టెండూల్కర్ జట్టు తరపున బరిలోకి దిగలేదు. అయితే అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్ సిమర్ జీత్ సింగ్ను జట్టులో చేర్చుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఇండియన్ ప్రీమియర్ మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ ను పూర్తి చేసిన తర్వాత ఈ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ యూఏఈలో జట్టుతో శిక్షణ ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడే సిమర్జీత్ సింగ్, ఇటీవల వైట్-బాల్ పర్యటన కోసం శ్రీలంక కు వెళ్లిన భారత జట్టు నెట్ బౌలర్లలో ఒక్కడిగా వ్యవరించాడు.