అయితే ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 18 పరుగులు చేసి వెనుదిరగగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. ఇక గత మ్యాచ్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ 2 పరుగులకు ఔట్ కాగా ఢిల్లీ కెప్టెన్ 18 చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన రిపాల్ పటేల్18 పరుగులు చేయగా అశ్విన్ రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును గెలుపు వైపుకు నడిపించాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కగిసో రబాడా మొదటి బంతికే బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే దీంతో ఈ ఏడాది ఐపీఎల్లో పదవ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్లతో టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అలాగే ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండవ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అయితే ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 18 పరుగులు చేసి వెనుదిరగగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. ఇక గత మ్యాచ్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ 2 పరుగులకు ఔట్ కాగా ఢిల్లీ కెప్టెన్ 18 చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన రిపాల్ పటేల్18 పరుగులు చేయగా అశ్విన్ రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును గెలుపు వైపుకు నడిపించాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కగిసో రబాడా మొదటి బంతికే బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే దీంతో ఈ ఏడాది ఐపీఎల్లో పదవ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్లతో టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అలాగే ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండవ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.