గత కొంత కాలం నుంచి పృథ్వీ షా  కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు యువ సంచలనం గా పేరు సంపాదించుకుని ఇక భారత క్రికెట్లో అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా ఆ తర్వాత మాత్రం పేలవమైన ఫామ్ కారణంగా చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే.. ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లలో కూడా అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు.. తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుని అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తున్నాడు పృథ్వీ షా.



 ఇక అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో సారి యువ ఆటగాడు పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన గురించి తెలియనప్పుడు ఒక అంచనాకు రావద్దు అంటూ చెబుతున్నాడు పృథ్వీ షా. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యోయో పరీక్షలో పృథ్వీషా విఫలమయ్యాడు. 16.5 పాయింట్లు కంటే ఎక్కువ స్కోర్ సాధించాల్సి ఉండగా.. పృథ్వీ షా మాత్రం 15 పాయింట్లు కంటే తక్కువ స్కోరు సాధించగలిగారు.


 దీంతో పృథ్వీ షాఐపీఎల్ ఆడటం కష్టమే అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయంపై స్పందించాడు. పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. నా పరిస్థితి ఏంటో తెలియనప్పుడు దయచేసి నా గురించి ఒక అంచనాకు రాకండి.. నన్ను నిందించకండి.. అలా చేస్తే నీ కర్మ మీరే బాధ్యులు అవుతారు అని పృథ్వీషా పేర్కొన్నాడు. ఇక ఇదే విషయంపై స్పందించిన ఢిల్లీ యాజమాన్యంలోని ఒక అధికారి యోయో పరీక్షతో ఐపీఎల్ కి ఎలాంటి సంబంధం లేదని ఇక యోయో పరీక్షలో విఫలమైనప్పటికీ కూడా ఐపీఎల్లో ఆడతాడు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: