అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది అని తెలుస్తోంది. టోర్నీలో ఒకే ఒక్క పరాజయంతో ఐపీఎల్ సీజన్ 15 కు బాస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ బ్యాట్స్మన్ తడబడుతూ ఆడుతున్నారు. ఈ సిరీస్ లో ఒకే ఒక్క మ్యాచ్ లో రాణించిన శుబ్ మాన్ గిల్ ఈ మ్యాచ్ లోనూ ఫెయిల్ అయ్యాడు. ఇక గత మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సాహా సైతం దొరికిన మంచి ఆరంభాన్ని బిగ్ స్కోర్ గా మలచలేకపోయాడు.
ఇక తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ ఒక్కడే నిలబడి నిదానంగా పరుగులు చేస్తున్నాడు. ఇక గత మ్యాచ్ హీరోలు మిల్లర్ మరియు తేవాతియా లు ఈ సారి ఆదుకోలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ దాదాపుగా పంజాబ్ చేతికి వెళ్ళిపోయినట్లే.. కానీ గుజరాత్ బౌలింగ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువ ఛేజింగ్ లో గెలిచినవే కావడం విశేషం. మరి ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ ఏ విధంగా రాణిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తేనే ముందుకు వెళుతుంది. లేదంటే ప్లే ఆప్స్ లో వెనకబడినట్లే.