ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా  ఆటగాడు రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకుని ఏకంగా సెంచరీలతో చెలరేగాడు. అటు ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ పంత్ చేసిన సెంచరీ మాత్రం భారత ప్రేక్షకులందరికీ కూడా గుర్తుండిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక టి20 సిరీస్ విజయంలో కూడా తనవంతు పాత్ర పోషించిన రిషబ్ పంత్ ఇక  వన్డే సిరీస్లో కూడా అదరగొట్టాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డే మ్యాచ్ లో సెంచరీ చేసి టీమిండియాను విజయం వైపు నడిపించాడు.


 72 పరుగుల వద్ద 4 వికెట్లు  కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్ ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన పై  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు షోయబ్ అక్తర్ . అతనో ఒక అద్భుతమైన ఆటగాడు.. అతడు కట్ షాట్, ఫుల్ షాట్, రివర్స్ స్వీప్ షాట్ ఇలా అన్ని షాట్లు ఆడగలడని చెప్పుకొచ్చాడు. అయితే ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా బంతిని బౌండరీకి తరలించగలడు అంటూ మెచ్చుకున్నాడు.



 గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో రిషబ్ పంత్ టీమిండియాను గెలిపించాడూ. ఇక ఇప్పుడు ఇంగ్లండ్లో కూడా భారత జట్టుకు సిరీస్ అందించాడు. ఇక పరిస్థితులకు తగ్గట్లుగా తన బ్యాటింగ్ మార్చుకుంటూ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతాడు. రాబోయే కాలంలో అతడు స్టార్ క్రికెటర్ కాబోతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు అని.. కొంచెం బరువు తగ్గించుకోవాలని  సలహా ఇచ్చాడు. ఇక రిషబ్ పంత్ కాస్త బరువు తగ్గించుకుంటే మోడల్ అవుతాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: