టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం ను టార్గెట్ చేస్తూ తీవ్రతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటే ఇంకొంతమంది ఏకంగా కీలక సమయంలో గాయం బారిన పడి బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడిన షాహిన్ అఫ్రీదిని టార్గెట్ చేస్తూ విమర్శలు  చేస్తున్నారు. ఇలా పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడాన్ని అసలు సహించలేని ఒక నేటిజన్ ఏకంగా షాహిన్  పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 షాహిన్ ఒక పిరికిపంద.. మిగతా ఐదు బంతులు వేసి నీ ఓవర్ పూర్తి చేయాల్సింది. కానీ పిరికివాడి లాగా మైదానాన్ని వీడి నువ్వు పరుగులు తీసావు అంటూ షాహిన్ ఆఫ్రిది నీ ఉద్దేశించి ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవల ఒక స్పోర్ట్స్ షో లో భాగంగా ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ సదరు నేటిజన్ అలా షాహిన్ ఆఫ్రిది ని ట్రోల్ చేయడం పై కాస్త ఘాటు గాని స్పందించాడు.. షాహిన్ ఆఫ్రిది గురించి అతడేమో అంటున్నాడు చూడండి. కాస్తైనా సిగ్గుండాలి. ఒకవేళ నువ్వు కనుక నా ఎదురుగా ఉండి ఉంటేనా అంటూ కోపంతో ఊగిపోయాడు వసీం అక్రమ్.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వైదికగా వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కాగా నవంబర్ 13వ తేదీన మేల్బోర్న్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే 13 ఓవర్ లో హరి బ్రూక్స్ క్యాచ్ అందుకునే క్రమంలో షాహిన్  మోకాలికాయం తిరగబట్టింది. దీంతో మైదానాన్ని  వీడిన షాహిన్ మళ్ళీ 16 ఓవర్ సమయానికి తిరిగి వచ్చాడు . ఈ క్రమంలోనే బౌలింగ్ వేసెందుకు ప్రయత్నించాడు. కానీ ఇక నొప్పి భరించలేక మళ్ళీ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: