అక్కడ వాళ్లు సాగు చేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ ఐదేళ్లపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. కొమురం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు సమకూర్చుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్ జంగిల్, జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడు.
కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుంచి 1940వరకు రణభేరి మోగించిన కొమురం భీమ్ నైజం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాటయోధుడు. నిజాం నవాబు పశువ్ఞల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. అసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్కు కుడిభుజంగా కొమురం సూరుకూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మరాము కూడా భీమ్కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దుపటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబరు 27న జోడేఘాట్ అడవ్ఞల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ని హతమార్చాయి.