ఏపీలో స్కూల్స్ ఓపెన్ చేసి సర్కార్ పట్టుదలగా ముందుకు వెళ్తున్న సమయంలో ప్రకాశం జిల్లాలో బయటపడిన కరోనా కేసులు ఆందోళన కలిగించాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 12కు చేరాయి కేసులు. పీవీఆర్ బాలికల హైస్కూల్ లో ఇద్దరు పదవ తరగతి, ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు స్కూల్ కి రావాలంటే భయపడుతున్నారు. అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో పాఠశాలల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు తల్లి తండ్రులు పిల్లలను స్కూల్ కి పంపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap