ఎయిడెడ్ కాలేజీలు, స్కూల్స్ కి సంబంధించి ఇప్పుడు వివాదం ఎక్కువగా నడుస్తుంది. వాటిని ప్రభుత్వ పరం చేయడం కాస్త సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పలు కాలేజీలు స్కూల్స్ లో ఎక్కువగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఒక కాలేజీలో నిర్వహించిన ధర్నా రెండు రోజుల క్రితం సంచలనం అయింది. అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేయగా కొందరికి గాయాలు అయ్యాయి.

నేడు కాలేజీ వద్ద విద్యార్ధులు మరోసారి నిరసనకు దిగే ప్లాన్ చేస్తున్నారు. కళాశాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు... నిరసనకు దిగే అవకాశం ఉంది. నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలలకు సెలవు ప్రకటించింది ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యం. ఆందోళన చేస్తున్న విద్యార్థులను నివారించాలని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: