కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేసింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఇవాళ గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు.

 
ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారు. 'అగ్నిపథ్' పేరుతో యువతను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. అగ్నిపథ్‌ పై ఆందోళనలు ఉధృతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల చలో రాజ్‌భవన్‌ పేరిట కాంగ్రెస్ భారీగా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఆ కార్యక్రమంతో కార్యకర్తలు బాగా యాక్టివ్ అయ్యారు. ఆ జోరు కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహ దీక్ష తలపెట్టింది.  ఈ సత్యాగ్రహ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకులు అంతా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: