తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రాయలవారి కోటను ప్రముఖ సినీ నటి గౌతమి సందర్శించారు. తిరుమల దర్శనం తర్వాత ఆమె చంద్రగిరి కోటకు వచ్చారు. కోటలోని పురావస్తు ప్రదర్శనశాలలో సినీ నటి గౌతమి సుమారు మూడు గంటల సమయం గడిపారు. అక్కడ ఉంచిన వస్తువుల, శిల్పాలు గూర్చి ప్రతి విషయాన్ని సినీ నటి గౌతమి క్షుణ్ణంగా మ్యూజియం అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఇటువంటి పురాతన కట్టడాలను వస్తువులను గూర్చి చరిత్రను మన పిల్లలకు తెలియజేసి భారతదేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సినీ నటి గౌతమి అన్నారు. రాజకీయ ప్రవేశంపై గౌతమి సున్నితంగా తోసిపుచ్చారు. జీవితంలో ఒక పక్క అవకాశాలు, మరోపక్క బాధ్యతలు వస్తుంటాయని సినీ నటి గౌతమి అన్నారు. అందరికీ సేవ చేయడం అనేది పెద్ద బాధ్యతగా  భావిస్తున్నానని సినీ నటి గౌతమి అన్నారు. మనం ఉన్నచోటే వీలైనంతవరకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే అది సేవ చేసినట్లే అని గౌతమి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: