కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ లోని సర్ధార్ వల్లభ్ బాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీ లో ఈనెల 11న 74వ ఐపిఎస్‌ బ్యాచ్‌ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొంటారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననుండగా.. 74 వ బ్యాచ్ లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా.. ఇందులో 166 ఐపిఎస్‌ క్యాడెట్స్, 29 మంది విదీశీ క్యాడెట్లు ఉన్నారు.

ఇక వీరిలో 37మంది  మహిళా ఐపిఎస్‌ లు, 4గురు విదేశీ మహిళలు ఉన్నట్లు అకాడమీ డైరెక్టర్‌ ఏ ఎస్‌ రాజన్ తెలిపారు. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో సాధారణ ట్రైనింగ్ కొనసాగిందట. 65 వారాల పాటు  కఠోర  శిక్షణ ఇచ్చామని.. రోజు రోజు కు సైబర్ నేరాలు పెరుగుతుండటంతో కేసుల ను చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత బ్యాచ్ లో  ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారట. మహిళలు చిన్నారుల పై నేరాల పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: