ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 14వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.ఇప్పటి దాకా 13వ విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం రూ.6 వేలను ఏడాదికి మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. వాయిదాకు రూ.2 వేల డబ్బు చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతోంది. 13వ విడత నిధులు ఫిబ్రవరి 26న విడుదలవ్వడం జరిగింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఏప్రిల్‌-జూలై నెలలోపు 14వ విడతకు సంబంధించిన డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ పథకానికి కంటే ముందే రైతులు మరో లబ్ధిపొందవచ్చు.రైతులు కొత్త వ్యవసాయ వ్యాపారం ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.15 లక్షల డబ్బుని అందజేస్తోంది. కేవలం వ్యవసాయం సంబంధిత వ్యాపారానికి కోసమే పీఎం కిసాన్‌ ఎఫ్‌పీఓ యోజన పథకాన్ని స్టార్ట్ చేసింది.


ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు మొత్తం రూ.15 లక్షలు అందజేస్తారు. ఇక మీరు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలనుకుంటే.. మొత్తం 11 మంది రైతులు కలిసి ఒక సంస్థను రెడీ చేసుకోవాలి. వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు ఇంకా మందులు కొనుగోలు సంబంధిత వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు.దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..ముందుగా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తరువాత హోమ్ పేజీలో ఇచ్చిన ఎఫ్‌పీఓ ఆప్షన్‌పై మీరు క్లిక్ చేయండి.ఆ తరువాత ఇక్కడ 'రిజిస్ట్రేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఫారమ్ ఓపెన్ అవుతుంది.ఆ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని మీరు జాగ్రత్తగా నింపండి.ఇక ఆ తరువాత పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ లేదా ఐడీని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. అంతా అయ్యాక చివరగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: