భార్య భర్తల బంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తరువాత ఒకరికి ఒకరుతోడు నీడ గా ఉండాలి అని అంటుంటారు పెద్దలు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా భర్తకు భార్య భార్య కు భర్త తోడు. అయితే ఇక భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ బంధానికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించారు ఓ జంట. సాధారణంగా భార్య గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితేనే భర్త కోపంతో ఊగి పోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం డబ్బులు సంపాదించడానికి భార్యనే తన అస్త్రంగా మార్చుకున్నాడు.


 భార్య అందాలను ఎరగా వేసి ఇతర మగాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ తర్వాత బ్లాక్మెయిల్కు దిగి డబ్బులు దండుకోవడం కూడా మొదలు పెట్టాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో యోగేష్ గౌతమ్, సప్న గౌతమ్ భార్య భర్తలు నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ జంట కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే వారి మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇక ఆ ఆలోచన రావడమే తడవు ఆ ఆలోచనను అమలులో పెట్టేశారు.



 ఈ క్రమంలోనే ఇంటర్నెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన మగాళ్ళకు వల వేయడం వారితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజడం లాంటివి చేయడం మొదలుపెట్టారు. అయితే మొదట తన అందాలతో వలవేసి వీడియో కాల్స్ మాట్లాడేలా చేస్తూ ఉంటుంది భార్య. ఇక ఆ తర్వాత భర్త యోగేష్ రంగంలోకి దిగుతాడు. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిన సమయంలో వీడియో రికార్డ్ చేసి ఇక వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తాడు   . అయితే వీళ్ళు ఇంత చేస్తున్నా పరువు పోతుంది అనే కారణంతో బాధితులు ఎవరూ కూడా తెరమీదికి రాలేదు . కానీ ఇటీవలే రాజ్కోట్ కు చెందిన తుషార్ అనే వ్యక్తి వీరి ట్రాప్ లో పడి 80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఇక ఈ జంట అసలు రంగు బయటపడింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు వీరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: