కొంత వలసదారులు అధికారుల కండ్లుగప్పి అక్రమంగా మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అక్రమ రవాణా ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. కార్గో ట్రక్కులో వలసదారులకు అధిక సంఖ్యలో తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపుగా107 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వాహనం బోల్తా పడడంతో 53 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స అందించేందకు ఆసుపత్రిలకు తరలించారు. మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.
కొంత వలసదారులు అధికారుల కండ్లుగప్పి అక్రమంగా మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అక్రమ రవాణా ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. కార్గో ట్రక్కులో వలసదారులకు అధిక సంఖ్యలో తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపుగా107 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వాహనం బోల్తా పడడంతో 53 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స అందించేందకు ఆసుపత్రిలకు తరలించారు. మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.