దేశంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. దీన్ని చెడగొట్టి అలజడి సృష్టించాలని పాక్ లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్నీ భారత ఆర్మీ భగ్నం చేసింది.  కాశ్మీర్లోని అనంత నాగ్  జిల్లాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో ఉగ్రవాదులు సరఫరా చేస్తున్న ఆయుధాలు పట్టుబడ్డాయి. భారత్ ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో దాడులు చేసి మళ్ళీ అల్లకల్లోలం సృష్టించాలని పాక్ లో ని కొన్ని ఉగ్రవాద సంస్థ లు కుట్రలు పన్నుతున్నట్లు అర్ధం అవుతోంది.


దీన్ని ఛేదించి అతి పెద్ద దాడి నుంచి ప్రజలను రక్షించారు. దాడులు చేస్తూ మళ్ళీ భారత్ ను భయపెట్టి రాక్షస ఆనందం పొందలనేది ఉగ్రవాదుల పన్నాగం.  అయితే దీన్ని ఛేదించి కాశ్మీర్లో ఆర్మీ ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన వారయ్యారు.  ఆర్మీ చేపట్టిన తనిఖీల్లో 5 ఐఈడి బాంబులు, 5 పిస్టల్స్, 124 రౌండ్లను కాల్చే బుల్లెట్స్, 6 డిటోనేటర్లు, అనేక రకాల నూతన ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. దీని వెనుక పాకిస్థాన్ లో ని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రోగ్రామేడ్ టైమర్ డివైసీస్, రేడియో కంట్రోల్ డివైసీస్, ఆర్సీఈ ఐఈడీస్, 5 పిస్టల్ మాగజైన్స్,4 రిమోట్ కంట్రోల్స్, 13 బ్యాటరీలు దొరికాయి. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇంతవరకు నాటో దేశాలు మాత్రమే యుద్ధంలో వాడేవి. అలాంటి ఆయుధాలు ఇపుడు పట్టుబడ్డాయి. అంటే ఏ టైం లో ఎక్కడ ఎంత స్థాయిలో పేలుళ్లు జరగాలి అనేది కూడా ప్రోగ్రాం టైమర్ బాంబులను రేడియో కంట్రోల్ యాక్సెస్ ఇస్తారు. అంటే దాడులు చేయడానికి కూడా ఎలాంటి భారీ ప్రణాళికలు రచించారో తెలుస్తుంది.


పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు. లేకపోతే ఇప్పటికే దేశంలో ఎన్నో ఉగ్ర దాడులు జరిగేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: