
జ్వరం వచ్చినప్పుడు కోడిగుడ్లు, చికెన్, చేపలు వంటి నాన్ వెజ్ వాటిని తింటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి కొత్తలో చికాకుగా అనిపించి అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయట . అంతేకానీ వాటిని తినడం వల్ల జ్వరం ఎక్కువ అవ్వదట. ఇక ఇతర జబ్బులు కూడా రావని వైద్యులు తెలియజేస్తున్నారు. అందుచేతనే జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ ను తినవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నారు.
శరీరానికి కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్స్ కూడా చాలా అవసరమే అందుచేతనే ప్రోటీన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా లభిస్తాయి అందుచేతనే నాన్ వెజ్ తింటే చాలా లాభాలు ఉంటాయి. అయితే జ్వరం వచ్చినప్పుడు వాంతులు వికారంగా ఉంటే వారు చేపలు చికెన్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక అలాంటివారు మసాలా కారం వంటివి తగ్గించుకోవడం చాలా మంచిదట.