మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా.. లేదా చాలా ఆహారం తిన్నా .. ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారాలను తిన్నా లేదా.. మాంసాహారం చాలా ఎక్కువగా తిన్నా.. మనకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం సహజం. అందువల్ల ఆ నొప్పితో విలవిలలాడిపోతాం. అయితే సాధారణంగా వచ్చే కడుపు నొప్పికి ఇంగ్లిష్ మెడిసిన్ ఎక్కువగా వాడుతుంటారు. కానీ అంత అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏ టిప్స్ ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు ఖచ్చితంగా చిన్న దాల్చిన చెక్క తినాలి. ఆ తరువాత ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.


అలాగే అజీర్తి, గ్యాస్‌, అసిడిటీ కూడా ఈజీగా తగ్గుతాయి. ఇక ఈ సమస్యల నుంచి బయట పడేందుకు పుదీనా రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు  భోజనానికి ముందు 4 టీస్పూన్ల పుదీనా రసాన్ని తీసుకోవాలి. 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే అల్లం, తేనెలను సమాన భాగాలుగా తీసుకుని భోజనానికి ఒక 15 నిమిషాల ముందు తినాలి. తేనెకు బదులుగా బెల్లంని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇలా రోజుకు మీరు 3 సార్లు చేయాలి. దీంతో తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఈజీగా తగ్గుతుంది. కడుపు నొప్పి నుంచి కూడా ఈజీగా బయట పడవచ్చు. ఇలా ఈ టిప్స్ పాటించడం వల్ల కేవలం కడుపు నొప్పి మాత్రమే కాదు.. ఇతర జీర్ణ సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. పొట్టంతా బాగా శుభ్రమవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఇటువంటి సమస్యలకి పూర్తిగా చెక్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: