రోజుకు 3 లీటర్ల నీటిని తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో 60-70% నీరు ఉంటుంది. ఈ నీరు శరీరంలో పలు కీలక పనులను నిర్వర్తిస్తుంది – శరీర ఉష్ణోగత నియంత్రణ నుంచి టాక్సిన్లు తొలగించడాన్ని వరకు. నీరు తగిన మోతాదులో తాగకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, ప్రతి రోజు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీటిని తాగడం శరీరానికి చాలా అవసరం. నీరు తగినంత తాగితే మూత్రం ద్వారా శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. ఈ ప్రక్రియ కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది. శరీరం తేలికగా, ఆరోగ్యంగా ఉంటుంది.

నీరు తాగడం వల్ల చర్మం తేమతో నిండి నిగారింపుగా కనిపిస్తుంది. మొటిమలు, పొడి చర్మం, ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మానికి సహజ కాంతి వస్తుంది. నీరు మలాన్ని సాఫీగా చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఇది ఇంకాస్త మెరుగ్గా పనిచేస్తుంది. నీరు తాగడం వల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. తినే మోతాదు తగ్గుతుంది. శరీరానికి తగిన తేమ ఉండడం వల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది. అధికంగా నీరు తాగడం వల్ల మెదడుకు తగిన తేమ లభిస్తుంది. ఒత్తిడి, నీరు లేకపోవడం వల్ల కలిగే తలనొప్పులను నివారించవచ్చు. 3 లీటర్ల నీరు తాగడం మూత్రపిండాలలో రాళ్ల ఏర్పాటును అడ్డుకుంటుంది.

 దీనివల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగవుతుంది. నీరు శరీర ఉష్ణోగతను సులభంగా నియంత్రించగలదు. వేసవిలో అధికంగా చెమట పట్టే సమయంలో నీరు తగినంత తాగితే డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. నీరు తగినంత తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది. థర్స్ట్ ఫీల్ తగ్గుతుంది, మానసిక అలసట తగ్గుతుంది. మూడ్ ఫ్రెష్‌గా ఉంటుంది. నీరు సెల్‌లను హైడ్రేట్ చేస్తూ శక్తిని అందిస్తుంది. శరీరం అలసట లేకుండా ఉంటుంది. ఫిజికల్ వర్క్ చేసే వారికి ఇది చాలా అవసరం. శరీరం శుభ్రంగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలో కూరుకుపోకుండా బయటికి వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: