అయితే ఇందుకు కుటుంబ ఆదాయం గ్రామాలలో నెలకు రూ.10 వేలు, పట్టణాలలో రూ .12 వేలు మించి ఉండకూడదు..
అలాగే భూమి మూడు ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి మిట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.
కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.
కుటుంబంలో ఎవరు కూడా పెన్షన్ తీసుకునేవారు కాకూడదు.
పారిశుద్ధ్య కార్మికుల కు మాత్రం ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది.
అలాగే కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఫోర్ వీలర్ ఉంటే ఈ పథకం వర్తించదు.. అలాగే ఆదాయ పన్ను కట్టే వారికి ఈ పథకం అసలు వర్తించదు. అలాగే వైయస్సార్ చేయూత కాపు నేస్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ పథకం వర్తించదు.
ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులను సైతం ప్రభుత్వం గుర్తించి ఫైనల్ జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈనెల 12వ తేదీన ఈ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయబోతోంది. మొత్తం మీద 8,85,567 దరఖాస్తులు రాగ ఇందులో..8,70,239 మాత్రమే అర్హులు అయినట్లుగా తెలుస్తోంది.