తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న నటీమణులు,సింగర్ తమ జీవితాల్లో పడుతున్న బాధలు ఏమిటో ఆ మద్య ప్రత్యక్షంగా సింగర్ సునిత చెప్పింది. చిత్రపరిశ్రమ, బుల్లి తెర పరిశ్రమ ఎంతో అందమైన లోకాలని అందరూ అనుకుంటారు కానీ అందులో కూడా చాలా కష్టాలు, కన్నీళ్ల గాథలు ఉన్నాయని వాటిని ఎవ్వరూ అర్ధం చేసుకోరని తాము పడుతున్న ఆవేధన ఎలాంటిదో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన భర్త తనను చాలా ఇబ్బందులు పెడుతున్నాడని తన పేరు చెప్పుకొని కొంత మంది వద్ద డబ్బులు వసూళ్లు కూడా చేస్తున్నాడని ఆరోపించింది. తన పిల్లలను అస్సలు పట్టించుకోవడం లేదని కనీసం మేం ఉన్నామా లేమా అన్న ఆరా కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే తన పిల్లలతో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతాడని కానీ తనను ఒక్క సారి కూడా గుర్తు చేయడని కన్నీరు పెట్టింది. ఇంతకాలం నోరు మెదపని ఆమె తన భర్త గురించి విషయాలు బయట పెట్టేసరికి ఆ వార్త చాలా మందికి ఆశక్తికరంగా ఉండి చాలా మందిని రీచ్ అయ్యింది. తన భర్త నుంచి ఎలా , ఎందుకు విడిగా ఉండాల్సి వచ్చింది అన్ని పంచుకుంది. అంతే కాదు తనకూ మాజీ ఎంపీ మధుయాష్కీకి ఉన్న సంబంధం ఏమిటో అవన్ని వట్టి పుకార్లే అని కొట్టి పడేసింది. 

ప్రస్తుతం యంకర్ గా కొనసాగుతూ..చిత్రాల్లో నటిస్తూ..ప్రైవేట్ కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యతగా నటిస్తున్న యాంకర్ ఝాన్సీ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు అందరి ముందుకు తీసుకు రాబోతుందట. ఇప్పుడు యాంకర్ ఝాన్సీ కూడా తన భాద త్వరలో వెల్లబుచ్చుతానని  తన భర్త జోగీ నాయుడు తో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నసంగతి, వాళ్ళ ప్రేమ, పెళ్లి మరియు విడాకులు అన్నిటి గురించి ఇంటర్వ్యూ త్వరలో ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: