ఈ మద్య సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లుగా తెగ చూపిస్తూ..జనాలను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు.  కొన్ని సార్లు మీడియాలో న్యూస్ చేస్తుంటే ఎంత గొప్ప అప్ డేటింగ్ ఉన్నా..ఫేక్ న్యూస్ లతో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు అయితే బతికి ఉన్నవారు చనిపోయిన్లటు వార్తలు వైరల్ చేయడం..లేదు బాబోయ్ మేము బతికే ఉన్నామని వారు క్లారిటీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.  ఇలాంటి ఫేక్ న్యూస్ లు దయచేసి కవర్ చేయకండి అంటూ సెలబ్రెటీలు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. 

ఇక తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 పై ఇప్పటి వరకు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ సీజన్ కి హూస్ట్ ఎవరు అన్న విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కింగ్ నాగార్జున అని కన్ఫామ్ అయ్యింది.  ఈ మద్యే ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ నెల మూడో వారంలో సీజన్ మొదలు కానుంది. 14 మంది కంటెస్టెంట్లుతో 100 రోజులు నడిచే ఈ హై డ్రామా ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి.  తాజాగా మరో లీస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి (జ్యోతి) , హీరో తరుణ్, మాస్టర్ రఘు , సింగర్ హేమచంద్ర , శ్రీ రెడ్డి , ఉదయభాను , వరుణ్ సందేశ్ , హాస్యనటుడు వైవా హర్ష , జాహ్నవి ఉన్నారని తెలుస్తుంది . అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ కూడా ఇందులో పాల్గొనబోతున్నరని తెలుస్తుంది . వీరే గనక ఇంటి సభ్యులు అయితే మాత్రం రచ్చ రచ్చే అంటున్నారు ఆడియన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: