జీవిత - రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మిక హీరోయిన్గా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా దొరసాని. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్లో హీరోయిన్ శివాత్మిక దర్శకుడు సుకుమార్ పై అభిమానం వ్యక్తం చేసిన విధానం అహూతులను ఆకర్షించింది. సుకుమార్ గారు .. మీరంటే నాకు ఎప్పటినుంచో ఎంతో అభిమానం అని సుకుమార్ వైపు కృతజ్ఞతగా చూసింది.
ఈ వేదికపైకి సుకుమార్ రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జీవిత - రాజశేఖర్ దంపతులపై అభిమానమే కాకుండా... దొరసాని దర్శకుడు మహేంద్రతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు మరో రీజన్ ఉందట. ఇకపై సుకుమార్ యంగ్ ట్యాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలిచ్చి సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలు నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథ రెడీ అవుతోందట. ఇక ఇప్పుడు దొరసాని వేదిక మీద శివాత్మిక సుకుమార్ను పొగడడంతో ఆమెనే ఈ సీక్వెల్ సినిమాకు హీరోయిన్గా ఎంపిక చేస్తారన్న గుసగుసలు వినిపించాయి. ఇది నిజం అయితే బాగుంటుందని కూడా అక్కడున్న వాళ్లు చర్చించుకున్నారు.
మరి వాస్తవంగా సుక్కు మదిలో ఎవరు ? ఉన్నారన్నది మాత్రం తెలియదు. అయితే కుమారిలో హెబ్బాపటేల్ చాలా బోల్డ్గా చేసింది. ఇప్పుడు శివాత్మిక బోల్డ్గా అంటే జీవిత ఖచ్చితంగా ఒప్పుకోదు. గతంలో ఓ బోల్డ్ సినిమా ట్రైలర్ ఫంక్షన్ వచ్చి జీవిత ఆ సినిమా దర్శకుడిని చెడామడా ఏకేసింది. ఇప్పుడు తన కుమార్తెను అలాంటి క్యారెక్టర్లో నటించేందుకు ఎందుకు ఒప్పుకుంటుంది ? అన్నది డౌటేగా..!